Kamakhya Temple | భారతదేశంలోని అత్యంత అరుదైన శక్తిపీఠాల్లో కామాఖ్య ఆలయం ఒకటి. జనన మరణాల నుండి విముక్తి కోరుకునే అనేక మంది స్త్రీ పురుషులు ఈ మందిరం వద్ద కామాఖ్య అమ్మవారి దయ కోసం ప్రార్ధించేవారు. అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో గువాహటి పట్టణంలో కామగిరి అని పిలువబడే నీలాచల్ కొండపై ఈ ఆలయం ఉంది. అయితే తాజాగా ఈ అమ్మవారిని సౌత్ హీరోయిన్ తమన్నా(Thamanna) దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న తమన్నాకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. కామాఖ్య ఆలయంలో తమన్నా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తమన్నా కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను తమన్నా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
ఇక ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే.. మహాశివుని భార్య అయిన సతీదేవి జననేంద్రియం ఇక్కడ పడిందని పురాణలు చెబుతున్నాయి. సతీదేవి ఆత్మాహుతి చేసుకుని మరణించిన తరువాత విష్ణువు ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు ఈ భూమిపై అనేక చోట్ల పడ్డాయి. అలా అమ్మవారి యోని భాగం ఇక్కడ పడింది. అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం, కామాఖ్య దేవాలయం అని పిలుస్తారు. పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. పెళ్లి కానీ అమ్మాయిలు కామాఖ్య అమ్మవారిని దర్శించుకుంటే త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఇక్కడి వారి నమ్మకం.