ఔరంగబాద్: ఎన్నికల వేళ దేశమంతా నామినేషన్ల(Lok Sabha Nominations) పర్వం నడుస్తోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను వేసేందుకు వేర్వేరు పద్ధతుల్లో రిట్నరింగ్ ఆఫీస్కు వెళ్తున్నారు. అయితే మహారాష్ట్రలోని ఔరంగబాద్లో ఇండిపెండెంట్ అభ్యర్థి సాహెబ్ ఖాన్ పఠాన్ వినూత్న రీతిలో తన నామినేషన్ వేశారు. నామినేషన్ వేసేందుకు ఆయన ఒంటెపై వెళ్లారు. నగరంలోని బిజీ వీధుల్లో ఆయన ఒంటెపై తిరిగారు. ఒంటెపై వెళ్తూ విక్టరీ సంకేతాన్ని ఇచ్చారాయన. ఔరంగబాద్ నియోజకవర్గంలో మే 13వ తేదీన పోలింగ్ జరగనున్నది. ఆ నియోజకవర్గంలో 30,52,724 ఓటర్లు ఉన్నారు. దీంట్లో 16,00,169 మంది పురుషులు, 14,52,415 మంది మహిళలు, 140 మంది థార్డ్ జెండర్ వ్యక్తులు ఉన్నారు.
#WATCH | Chhatrapati Sambhajinagar, Maharashtra: Independent candidate from Aurangabad Lok Sabha Saheb Khan Pathan went to file his nomination riding a camel. pic.twitter.com/SMZcfIjWlA
— ANI (@ANI) April 24, 2024