WPL 2024 : WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో మినీ వేలం(WPL Mini Auction 2024) మొదలైంది. ముంబైలో జరుగుతున్న వేలం పాట తొలి రౌండ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అన్నాబెల్ సథర్లాండ్(Annabel Sutherland) రికార్డు ధర పలికింది. రూ. 40 లక్షల కనీస ధరతో రిజిష్టర్ అయిన ఈ ఆల్రౌండర్ వేలంలో రూ.2 కోట్లు కొల్లగొట్టింది.
అన్నాబెల్ కోసం ముంబై ఇండియన్స్(Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ రూ. 2 కోట్లతో కొనుగోలు చేసింది. అన్నాబెల్కు టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది. ఆమె 14 మ్యాచుల్లో 288 రన్స్ సాధించింది. బౌలింగ్లోనూ సత్తా చాటుతూ 23 వికెట్లు పడగొట్టింది.
Bowler ho ya Batter, here she comes to haunt them all🔥
𝗔𝗻𝗻𝗮𝗯𝗲𝗹 𝗦𝘂𝘁𝗵𝗲𝗿𝗹𝗮𝗻𝗱 👉 DC 💙#YehHaiNayiDilli #WPLAuction pic.twitter.com/BnMz9XdmSc
— Delhi Capitals (@DelhiCapitals) December 9, 2023
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న డబ్ల్యూపీఎల్ వేళాన్ని శనివారం బీసీసీఐ అధ్యక్షుడు, డబ్ల్యూపీఎల్ ఛైర్ పర్సన్ రోజర్ బిన్ని(Roger Binny) ప్రారంభించారు. అనంతరం ఆక్షనీర్ మల్లికా సాగర్(Mallika Sagar) లిచ్ఫీల్డ్ పేరుతో వేలం మొదలెట్టింది. రూ.30 లక్షల కనీస ధరతో రిజిష్ఠర్ అయిన లిచ్ఫీల్డ్ కోసం యూపీ వారియర్స్(UP Warriorz), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ రూ. 1 కోటికి ఆమెను కొనుగోలు చేసింది.