వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. నాలుగు రోజుల్లో ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఆసీస్ నిర్దేశించిన 369 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్నైట్ స్కోరు 111-3 ఆట కొనసాగించిన కివీస్ రెండో ఇన్నింగ్స్లో 196 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా వెట్న్ స్పిన్నర్ నాథన్ లియాన్(6-65) ధాటికి న్యూజిలాండ్ విలవిలలాడింది.
రచీన్ రవీంద్ర(59), డారిల్ మిచెల్(38), స్కాట్ కుగెలిన్(26) తప్ప మిగతా బ్యాటర్లంతా ఘోరంగా నిరాశపరిచారు. లియాన్ తన సుదీర్ఘ అనుభవంతో కివీస్ బ్యాటర్లకు మూకుతాడు వేశాడు. పిచ్పై బంతి గింగిరాలు తిప్పుతూ కివీస్ పతనాన్ని శాసించాడు. లియాన్కు తోడు హాజిల్వుడ్ రెండు వికెట్లు తీశాడు. టెస్టుల్లో పది వికెట్ల ప్రదర్శన కనబర్చడం లియాన్కు ఇది ఐదోసారి. ఆసీస్ ఓపెనర్ కామెరూన్ గ్రీన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 8 నుంచి క్రైస్ట్చర్చ్లో జరుగనుంది.