బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లతో జరిగే వన్డే, టెస్టు సిరీస్లకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) జట్లను ప్రకటించింది. ప్రపంచకప్ గ్రూపు దశలోనే ఆసీస్ పోరు ముగియడంతో ఇక వేసవి సమరానికి పాట్ కమిన్స్ సారథ్యంలో జట్లు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 17, 19, 22 తేదీలలో వరుసగా అడిలైడ్, సిడ్నీ, మెల్బోర్న్లలో ఇంగ్లండ్తో ఆసీస్ వన్డేలు ఆడనున్నది. అనంతరం వెస్టిండీస్తో పెర్త్, అడిలైడ్లలో రెండు టెస్టులు ఆడుతుంది. డిసెంబర్ 17నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలలో తలపడుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా భారత్లో పర్యటించనున్నది.