సెయింట్ లూసియా: కరోనా కారణంగా మరో క్రికెట్ మ్యాచ్ వాయిదా పడింది. గురువారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వెస్టిండీస్ టీమ్లోని సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టాస్ కూడా పడిన తర్వాత ఈ మ్యాచ్ వాయిదా పడటం గమనార్హం. ఇప్పుడు రెండు జట్లలోని ప్లేయర్స్ అందరికీ మరోసారి టెస్టులు నిర్వహించనున్నారు.
ఈ మ్యాచ్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో తర్వాత ప్రకటించనున్నారు. బయో బబుల్లో ఉన్న వాళ్లందరినీ ఐసోలేషన్లో ఉంచనున్నట్లు ఐసీసీ తెలిపింది. శుక్రవారం ప్లేయర్స్కు నిర్వహించిన టెస్టుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాతే మిగతా రెండు వన్డేలపై నిర్ణయం తీసుకోనున్నారు.