Steve Smith : మరో వారంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023) సమరం మొదలవ్వనుంది. తొలిసారి టెస్టు గదను దక్కించుకునేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్కు వేదిక అయిన ఓవల్(Oval) పిచ్ గురించి ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(Steve Smith) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్లో భారత పరిస్థితులు ఉంటాయని, ఓవల్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందని అన్నాడు.
‘ఓవల్లో కొన్నిసార్లు స్పిన్నర్లకు అనూకూలంగా ఉంటుంది. ఆట కొనసాగే కొద్దీ బంతి బాగా స్పిన్ అవుతుంది. అచ్చం భారత్లో చూసిన పరిస్థితులే ఇక్కడ కనిపించే అవకాశం ఉంది అని అతను వెల్లడించాడు. అంతేకాదు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని అన్నాడు. ఓవల్ స్టేడియానికి చాలామంది ఫ్యాన్స్ వస్తారు. అయితే.. వాళ్లలో ఆస్ట్రేలియన్ల కంటే భారతీయులే ఎక్కువ ఉంటారు. ఈ మ్యాచ్ చాలా గొప్పగా ఉండనుంది’ అని స్మిత్ తెలిపాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 జరగనున్న ఓవల్ స్టేడియం(ఇంగ్లండ్)
ఇంగ్లండ్లోని ఓవల్ మైదానంలో జూన్ 7 -11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. స్వదేశంలో ఆసీస్ను ఓడించిన భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన టీమిండియా టెస్టు గదపై కన్నేసింది. టాప్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పూజారాతో పాటు బౌలర్లు షమీ, సిరాజ్, అశ్విన్, జడేజా ఫామ్లో ఉండడం భారత్కు కలిసిరానుంది. మరోవైపు ఆసీస్ కూడా విజయంపై ధీమాగా ఉంది. తటస్థ వేదికపై మ్యాజ్ నిర్వహిస్తుండడంతో ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ముగియడంతో మిగిలిని భారత క్రికెటర్లు ఇంగ్లండ్ వెళ్లనున్నారు.
ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు భంగపాటు ఎదురైంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని 4-2తో కోల్పోయింది. తొలి రెండు టెస్టుల్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ధాటికి ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇండోర్లో జరిగిన మూడో టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించిన స్మిత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. స్పిన్నర్ నాథన్ లియాన్ 8 వికెట్లతో విజృంభించడంతో భారత్ ఓడిపోయింది. సిరీస్ డిసైడర్ అయిన నాగ్పూర్ టెస్టు డ్రాగా ముగిసింది. దాంతో భారత్ మరోసారి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.