AUS vs WI: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో మాత్రం కంగారూలను కంగారు పెట్టిస్తోంది. బ్రిస్బేన్ (గబ్బా) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బ్యాట్తో పాటు బంతితోనూ విండీస్ అంచనాలకు మించి రాణిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో మిడిలార్డర్, లోయరార్డర్ బ్యాటర్లు రాణించడంతో 311 పరుగులు చేసిన విండీస్.. ఆసీస్ను 289 పరుగులకే పరిమితం చేసి 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా ఆసీస్ ఎదుట 216 పరుగుల లక్ష్యాన్ని నిలపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
గబ్బా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో విండీస్కు రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లు మరోసారి నిరాశపరిచారు. క్రిక్ మెకంజీ (41) ఒక్కడే టాప్ స్కోరర్. గత మ్యాచ్లో అర్థ సెంచరీలతో రాణించిన కవెమ్ హాడ్జ్ (29), జోషువా డిసిల్వ (7)లు విఫలమయ్యారు. జస్టిన్ గ్రీవ్స్ (33) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో హెజిల్వుడ్, లియాన్లు తలా మూడు వికెట్లు తీశారు.
STUMPS on Day 3!
Australia needs 156 to win this test match , Westindies will be looking to take 8 more wickets to create a history.
Brilliant finish on cards on the day 4 of this Gabba test match.
The good news is that Smith is on the crease!#ENGvsIND#CricketTwitter pic.twitter.com/YOhtiL7hPk
— paRaY_YasiR ✍️ (@ParayYasir2) January 27, 2024
అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్.. ఆరో ఓవర్లోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (10) వికెట్ కోల్పోయింది. అల్జారీ జోసెఫ్.. ఖవాజాను ఔట్ చేసి విండీస్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్నస్ లబూషేన్ (5)ను గ్రీవ్స్ ఔట్ చేయడంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (33 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్ (9 బ్యాటింగ్) లు ఆసీస్ను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 60 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 156 పరుగులు కావాలి.
ఆ ఫలితం రిపీట్ అవుతుందా..?
గబ్బా అంటేనే భారత అభిమానులకు గుర్తొచ్చేది 2021లో ఇదే వేదికపై టీమిండియా ఆసీస్పై సాధించిన అద్భుత విజయం. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 2021లో ఇక్కడ జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా నిర్దేశించిన 329 పరుగుల లక్ష్యాన్ని భారత్.. ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ మ్యాచ్లో శుభ్మన్ గిల్ (91), రిషభ్ పంత్ (89 నాటౌట్)లతో పాటు పుజారా (56), వాషింగ్టన్ సుందర్ (22)లు పోరాడటంతో భారత్ ఆ మ్యాచ్తో పాటు ట్రోఫీని కూడా గెలుచుకోగలిగింది. భారత క్రికెట్ విజయాల్లో గబ్బా గెలుపు ఓ అపురూపమని ఇటీవలే టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పిన విషయం తెలిసిందే. మరి విండీస్.. టీమిండియా స్ఫూర్తితో చెలరేగుతుందా..? లేక చేతులెత్తేస్తుందా..? అనేది ఆదివారం తేలనుంది.