AI Pics | నేటి తరం టెక్ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence). ఇది సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చాట్ జీపీటీ (ChatGPT)కి ముందు.. ఆ తర్వాత అనే స్థాయిలో మనిషి జీవితంపై ఏఐ (AI) ప్రభావం చూపుతోంది. టెక్ రంగంలోనే కాదు.. ఆర్టిస్ట్ల ఊహా శక్తికీ ఏఐ (AI) రెక్కలు తొడుగుతోంది.
ఏఐ సాయంతో ఇటీవల ప్రపంచంలోనే అత్యంత కుబేరులు పేదవారైతే ఎలా ఉంటారని ఊహిస్తూ ఓ వ్యక్తి వెల్లడించిన ఇమేజ్లు నెట్టింట వైరలైన విషయం తెలిసిందే. జెఫ్ బెజోస్ నుంచి ఎలాన్ మస్క్ వరకూ పలువురు బిలియనీర్లు బికారులుగా పుడితే ఎలా ఉంటారనే ఊహకు ఆ చిత్రాలు ఊపిరిపోశాయి. కాగా, తాజాగా మన టీంఇండియా మెన్ క్రికెటర్లు ( Indian Cricketers) అమ్మాయిల్లా ఉంటే ఎలా ఉంటారో ఏఐ సాయంతో ఓ వ్యక్తి కళ్లకు కట్టినట్లు చూపించాడు.
టీం ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శుభమ్ గిల్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్లను మహిళలుగా ఊహించుకుంటూ ఏఐ రూపొందించిన పది చిత్రాలు ఓ యూజర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ఆ మేల్ క్రికెటర్లందరికీ ఫీమేల్ పేర్లు కూడా పెట్టాడు. విరాట్ కోహ్లీకి విద్యా కోహ్లీ అని, శుభమ్ గిల్- సుభద్ర గిల్, మహేంద్ర సింగ్ ధోనీకి మహీ సింగ్ ధోనీ.. ఇలా వారికి ఫీమేల్ పేర్లు పెట్టాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Also Read..
Asia Cup | పాకిస్థాన్కు భారీ షాక్.. చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం
Madhya Pradesh | నదిలో పడిపోయిన బస్సు.. 14 మంది మృతి
Jassym Lora: ఆండ్రూ రస్సెల్ భార్య లోరాను చూశారా.. పిక్స్ వైరల్