కోల్కతా: వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్ కోల్కతా నైట్ రైడర్స్కు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అతను సూపర్ పర్ఫార్మ్ చేశాడు. 23 బంతుల్లో 42 రన్స్ స్కోర్ చేసి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. రస్సెల్ భార్య జాసిమ్ లోరా(Jassym Lora )కు చెందిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లోరాను 2016లో రస్సెల్ పెళ్లి చేసుకున్నాడు. ఆ జంటకు ఓ కూతురు ఉంది. ఆమెకు ఆలియా రస్సెల్ అన్న పేరు పెట్టారు.
లోరాతో చాన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత ఆమెను 2016లో పెళ్లాడాడు. లోరాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఆమెకు సుమారు 3.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. భార్య జాసిమ్ లోరా వల్లే తాను మేటి బ్యాటర్గా రాణిస్తున్నట్లు ఇటీవల రస్సెల్ పేర్కొన్న విషయం తెలిసిందే.
రస్సెల్ ఎక్కడికి వెళ్లినా లోరా.. అతనితోనే ఉంటుంది. స్టేడియం స్టాండ్స్ నుంచి లోరా ఎప్పుడూ రస్సెల్ను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా ఆమె ఇండియాలోనే ఉంది.