Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మరోసారి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తండ్రి (Sarfaraz Khans Father) నౌషద్ ఖాన్కు (Naushad Khan) థార్ కారును బహుమతిగా అందించారు (Gifts Thar Car).
2013లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్.. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన ఐదుటెస్టుల సిరీస్లో భాగంగా మూడోటెస్ట్ మ్యాచ్లో తొలిసారిగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే 62 పరుగులు చేసి రాణించాడు. తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సర్ఫరాజ్పై ప్రశంసలు కురిపించారు. ఆనంద్ మహీంద్రా సైతం సర్ఫరాజ్ ఆటతీరుకు ఫిదా అయ్యారు.
ఈ మేరకు సర్ఫరాజ్ తండ్రికి థార్ కారును బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎక్స్ (ట్విట్టర్) పోస్టులో సర్ఫరాజ్ను మహీంద్రా ప్రశంసిస్తూనే తన సందేశాన్ని చెప్పారు. ‘ధైర్యం కోల్పోవద్దు. శ్రమ, ధైర్యం, సహనం. పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు తండ్రికి ఇంతకంటే మంచి గుణం ఏముంటుంది. స్పూర్తిదాయకమైన తండ్రిగా నౌషాద్ ఖాన్ ‘థార్’ కానుకగా స్వీకరిస్తే అదే నాకు ఆనందం.. దక్కిన గౌరవం’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తాజాగా తాను ఇచ్చిన ప్రామిస్ను మహీంద్రా నిలబెట్టుకున్నారు.
“Himmat nahin chodna, bas!”
Hard work. Courage. Patience.
What better qualities than those for a father to inspire in a child?
For being an inspirational parent, it would be my privilege & honour if Naushad Khan would accept the gift of a Thar. pic.twitter.com/fnWkoJD6Dp
— anand mahindra (@anandmahindra) February 16, 2024
రాజ్కోట్ టెస్టు తొలి ఇన్సింగ్స్లో రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత సర్ఫరాజ్ బ్యాటింగ్కు వచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చిచెండాడు. సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చిన సమయంలో రవీంద్ర జడేజా 84 పరుగుల వద్ద ఉండగా.. సర్ఫరాజ్ పెవిలియన్కు చేరే సమయంలో 99 పరుగులు చేశాడు. దాంతో సర్ఫరాజ్ బ్యాటింగ్ ఎలా సాగిందో తెలుస్తుంది. సర్ఫరాజ్ కేవలం 48 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ సాధిస్తాడని అనుకున్నా 62 పరుగుల వద్ద రనౌట్గా వెనుదిరిగాడు.
Also Read..
Terror Attack | మాస్కోలో ఉగ్రదాడి.. నెలక్రితమే హెచ్చరించామన్న అమెరికా
Kate Middleton | అదృశ్యం వార్తల వేళ.. క్యాన్సర్ బారినపడినట్లు ప్రకటించిన కేట్
PM Modi | అండగా ఉంటాం.. మాస్కో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ