హైదరాబాద్, ఆట ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా జరిగిన 50వ ఆల్ ఇండియా ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ట్ర స్టార్ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ పసిడి పతకంతో మెరిసింది. ఆర్బీఐ తరఫున బరిలోకి దిగిన శ్రీజ..మహిళల సింగిల్స్ ఫైనల్లో 11-6, 11-7, 13-11, 11-5తో మౌమిత దత్తా(ఆర్ఎస్పీబీ)పై అద్భుత విజయం సాధించింది.
మరోవైపు పురుషుల విభాగంలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ 2-4తో మానుశ్ షా(ఆర్బీఐ) చేతిలో ఓడి కాంస్య పతకం దక్కించుకున్నాడు.