హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఈ నెల 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్తో సిరీస్కు తెరలేవనుండగా, డిసెంబర్ 3న ఆఖరి మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే సరిగ్గా అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానుండటంతో మ్యాచ్కు పూర్తి స్థాయి భద్రత కల్పించలేమని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఇదే విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) లేఖ ద్వారా బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీసీసీఐ నుంచి ప్రతిస్పందన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ నిర్వహణకు అవకాశం లేకపోతే హైదరాబాద్ నుంచి వేరే వేదికకు మ్యాచ్ మార్చే చాన్స్ ఉంది.