న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక టెస్టు విజయం సాధించిన భారత మహిళల జట్టు ఇక పరిమిత ఓవర్ల సిరీస్పై దృష్టి పెట్టింది. కంగారూలపై తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్లో ఓ మ్యాచ్ నెగ్గిన టీమ్ఇండియా.. వన్డే, టీ20ల్లోనూ సత్తాచాటాలనే ఉద్దేశంతో యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలు ఇచ్చింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించింది.
శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైఖా ఇషాఖ్, టిటాస్ సధు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరగనుంది. రెండు ఫార్మాట్లలోనూ హర్మన్ప్రీత్ కౌర్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది.
వన్డే జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి, జెమీమా, షఫాలీ, దీప్తి, యస్తిక, రిచ, అమన్జ్యోత్, శ్రేయాంక, మన్నత్, సైకా, రేణుక, టిటాస్ సధు, పూజ, స్నేహ్ రాణా, హర్లీన్.