హంబన్టోటా: టాపార్డర్ రాణించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. చరిత అసలంక (91), ధనంజయ డిసిల్వ (51) రాణించారు.
ప్రత్యర్థి బౌలర్లలో ఫజల్హఖ్, ఫరీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం అఫ్గాన్ 46.5 ఓవర్లలో 4 వికెట్లకు 269 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (98), రహమత్ షా (55), కెప్టెన్ హష్మతుల్లా (38) ఆకట్టుకున్నారు.