Sachin Tendulkar | టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఆసీస్లో అడుగుపెట్టిన రోహిత్ సేన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు టీమిండియా ప్లేయర్ల ఆట తీరుపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ భారత ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. జీవితమంటే గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నారు. ‘నాణేనికి రెండు పార్శ్వాలు ఉంటాయి. జీవితం కూడా అంతే. మన జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు.. ఓటమిని కూడా అలానే స్వీకరించాలి. జీవితంలో ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి’ అంటూ ట్వీట్ చేశారు.
టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం ఇంగ్లాడ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు.. టీమ్ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు మరోసారి విఫలమవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసింది. దీంతో పదిహేనేండ్ల క్రితం జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో ఛాంపియన్గా నిలిచిన టీమ్ఇండియా.. మరోమారు కప్పు సాధించాలని కోరుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.
A coin has two sides, so does life.
If we celebrate our team’s success like our own then we should be able to take our team's losses too…In life, they both go hand in hand.#INDvsENG
— Sachin Tendulkar (@sachin_rt) November 10, 2022