న్యూఢిల్లీ: భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్పై స్పష్టతనిచ్చింది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ తన కెరీర్లో చివరిదని వెల్లడించింది. శనివారం ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న మిథాలీ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించి 21 ఏైండ్లెంది. 2022 వన్డే వరల్డ్కప్ నా కెరీర్లో చివరిదవుతుందనుకుంటున్నా. జట్టులో ప్రస్తుతమున్న జులన్ గోస్వామి కెరీర్ కూడా చివరికి వచ్చింది. కాబట్టి అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ల కోసం చూస్తున్నాం. ప్రపంచకప్ నాటికి ఈ సమస్యను అధిగమించాలి’ అని చెప్పింది.