హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలోని క్షవర వృత్తిశాలలు, లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించేందుకు ఉత్తర్వులు ఇచ్చినందుకు బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కిశోర్గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆదివారం జీవో విడుదలచేయడం సంతోషకరమని అన్నారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ, మరోవైపు ఉచిత విద్యను అందించే విధంగా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేయడమే కాకుండా కులవృత్తులకు అనేక రాయితీలు కల్పించి ప్రోత్సహించడం గొప్ప విషయమని కిశోర్గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు బడుగు బలహీనవర్గాల ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.
ఇవీ కూడా చదవండి…
సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’