హుబ్లీ: బ్యాటర్లందరూ నిలకడగా రాణించడంతో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ రెండో రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిరోజు శుభమ్ (121) సెంచరీకి తోడు సమద్ (61) రాణించగా ఓవర్ నైట్ స్కోరు 284/2తో బ్యాటింగ్కు వచ్చిన ఆ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 527 పరుగుల భారీ స్కోరు చేసి మ్యాచ్పై పట్టు బిగించింది.
రిటైర్డ్ హర్ట్ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ పరాస్ (70), కన్హయ వాధవన్ (70), సాహిల్ (57 బ్యాటింగ్) అర్ధ శతకాలతో రాణించి ఆ జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. కర్ణాటక బౌలర్లు రోజంతా శ్రమించినా 5 వికెట్లు మాత్రమే తీయగలిగారు. మ్యాచ్ సందర్భంగా జమ్మూ సారథి పరాస్.. కర్ణాటక సబ్స్టిట్యూట్ ఫీల్డర్ కేవీ అనీష్తో వాగ్వాదానికి దిగి హెల్మెట్తో అతడిని ఢీకొట్టాడు. నిబంధనలను అతిక్రమించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించే అవకాశాలున్నాయి.