సిద్దిపేట : టీఆర్ఎస్లోకి జోరుగా వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎల్లు రవీందర్ రెడ్డి 100 మంది అనుచరులతో మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సిద్దిపేట అభివృద్ధిపై ఓర్వలేని వాళ్లు ఓట్లు ఎట్లా అడుగుతారని సూటిగా ప్రశ్నించారు.
గతంలో సిద్దిపేటలో తాగునీటి సమస్య ఎంత తీవ్రస్థాయిలో ఉండేదో మీ అందరికీ తెలుసు. నేడు తాగునీటి సమస్యను పరిష్కరించి మీ ఇంటికి నల్లా నీళ్లను తీసుకొచ్చిన టీఆర్ఎస్ను ఆదరించాలన్నారు.
గతంలో ఏ గల్లీలో చూసిన ఖాళీ బిందెలతో మా ఆడపడుచులు మాకు ఎదురయ్యే వాళ్లు. మా గల్లీ లో ఒక బోరు వేయించాలని కోరేవారన్నారు. కాంగ్రెస్ వల్ల గానీ, బీజేపీ వాళ్లతో ఎలాంటి అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కేవలం టీఆర్ఎస్ తో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు.
గతంలో సిద్దిపేటలో మోరీలు, పందులు, మురికివాడలు మాత్రమే కనబడేవి.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీరు ఎక్కడ చూసినా పరిశుభ్రమైన అద్దంలాంటి గల్లీలు కానవస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
గతంలో సిద్దిపేటకు పిల్లని ఇయ్యాలంటే భయపడేవారు. ఎక్కడ అమ్మాయితో నీళ్లు మోపిస్తారో..బోరింగు కొట్ట లేక తమ బిడ్డ చేతులు పోతాయని ఇచ్చేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.
బీడీ కార్మికులను, వృద్ధులను టీఆర్ఎస్ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. వైద్యరంగంలోను సిద్దిపేట దూసుకెళ్తుందన్నారు.సిద్దిపేటలో సకల సౌకర్యాలతో 400 పడకల ప్రభుత్వ దవాఖాన ప్రైవేటుకు దీటుగా వైద్యం అందుతుందన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?