కోహెడలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్ నాయకులు
కోహెడ: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం టీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు జాలిగాం శంకర్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వరకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజల ఆదరణ పొందుతున్న మంత్రి కేటీఆర్ను విమర్శించే స్థాయి ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్రెడ్డికి
లేదన్నారు.
ఇకనైనా మంత్రి కేటీఆర్ను విమర్శించడం మానుకోవాలని లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల మహేందర్, యువత నాయకులు బండ వెంకటస్వామి, తిప్పారపు నాగరాజు, ఒజ్జపల్లి శ్రీనివాస్, పోలవేని కుమారస్వామి, బత్తిని సంపత్, వట్టిపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు రాకేశ్, తోట రాజ్కుమార్, ఎల్లబోయిన వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.