హుస్నాబాద్ : అప్పులు తీర్చే మార్గంలేక ఓ యువకుడు శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన రాకేశ్ హుస్నాబాద్ పట్టణంలో బైక్ మెకానిక్గా పనిచేస్తూ అక్కన్నపేట రోడ్డులోని ఓ ఇంట్లో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. షాపు సరిగ్గా నడువక తీసుకొచ్చిన అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చే మార్గంలేక మనస్తాపం చెందిన రాకేశ్ తన రూములో చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సర్కారు దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ శ్రీధర్ వివరించారు.