సిద్ధిపేట : జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామం దమ్మ చెరువులో 56 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్రావు అందజేశారు. శనివారం జరిగిన సామూహిక గృహ ప్రవేశాలకు మంత్రి హాజరై గృహా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. చింతమడక- దమ్మ చెరువు ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ గ్రామస్తులందరిదీ ఒకే మాట.. ఒకే బాట. ఐక్యత ఉంటే తొందరగా పనులు జరుగుతాయనేందుకు నిదర్శనం చింతమడక-దమ్మచెరువు అన్నారు.
60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏలాంటి సాయం అందించాలన్న అంశంపై సీఎం కేసీఆర్తో తర్వలోనే చర్చించి నిర్ణయిస్తామన్నారు. చింతమడక-దమ్మచెరువు మిగులు పనులు, లబ్ధిదారులకు రావాల్సిన నిధుల విషయమై వారంలో పరిష్కారం చేస్తామన్నారు. చింతమడక-దమ్మచెరువు గ్రామాల్లో మినీ ఫంక్షన్ హాల్, బడి, అంగన్వాడీ, బస్ షెల్టర్, నర్లేoడ గడ్డ రోడ్డును త్వరలోనే వేయిస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.