అభివృద్ధిలో ఆదర్శంగా..
మెదక్ మండలం పాతూర్ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. రూ.20లక్షలతో గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రూ.10లక్షలతో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీతో పాటు వాటర్ ట్యాంకర్ను కొనుగోలు చేశారు. రూ.14లక్షలతో వైకుంఠధామం, రూ.2లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డును నిర్మించారు. రూ.20లక్షలతో రైతు వేదికను నిర్మించారు. గ్రామంలో సుమారు రూ.50లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని ఈ గ్రామం, స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకపోతున్నది.
నిత్యం ఇంటింటికెళ్లి చెత్త సేకరణ..
గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ కోసం రెండు చొప్పున 1116 చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల వరకు పంచాయతీ ట్రాక్టర్ గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నది. మహిళలు కూడా తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి, ట్రాక్టర్లో వేస్తున్నారు. చెత్తను డంపింగ్యార్డుకు తరలించి, కంపోస్ట్ తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ పారిశుధ్య కార్మికులు మురుగు కాల్వలను శుభ్రపరుస్తున్నారు. చెత్తాచెదారం లేకుండా రోడ్లన్నీ శుభ్రంగా ఉంచుతున్నారు.
ప్రగతి పనులతో కొత్త శోభ..
పల్లెప్రగతి పనులతో గ్రామానికి కొత్తందాలు వచ్చాయి. గ్రామంలో నిర్మించిన ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతువేదిక ప్రగతికి అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం, నేడు పల్లె ప్రగతితో రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న నిధులతో గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గం సభ్యులు, ప్రజల సహకారంతో ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు.
గ్రామం ప్రగతి దారిలో నడుస్తున్నది..
పల్లెప్రగతితోనే గ్రామం అభివృద్ధి దిశగా నడుస్తున్నది. ఇంటింటికీ చెత్త బుట్టలు పంచాం. పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, రైతువేదిక, డంపింగ్ యార్డు, సీసీరోడ్లు నిర్మించాం. పారిశుధ్య పనుల పర్యవేక్షణ, వీధి దీపాల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమైంది.
రూ.50లక్షలతో పనులు చేశాం..
ప్రజల సహకారంతోనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. రెండేండ్లలో రూ.50లక్షల నిధులతో పనులను చేశాం. రూ.20లక్షలతో గ్రామంలో సీసీరోడ్లను నిర్మించాం. రూ.10లక్షలతో పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీతో పాటు వాటర్ ట్యాంకర్ కొన్నాం. రూ.14లక్షలతో వైకుంఠధామం, రూ.2లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించాం.