వనపర్తి, మే 28 : కరోనా కట్టడి లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కళాజాత, ఇండియా చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కరోనాపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా గాంధీచౌక్ వరకు నాటక ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ సూచనలను పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే కలిగే అనర్థాలను కండ్లకు కట్టినట్లు చూపించారు. యమధర్మరాజుగా విభూతి ఈశ్వర్, చిత్రగుప్తుడిగా పానుగంటి నాగన్న, యమబంట్లుగా సిరువాంటి శంకర్, దేవేందర్, కరోనా బొమ్మగా పోన్నగంటి అంజి, కరోనా పేషెంట్గా ఈశ్వర్, డాక్టర్గా రాఘవేంద్ర, పోలీస్గా శంకర్, పారిశుధ్య కార్మికుడిగా సత్యనారాయణ వేషధారణ వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, కౌన్సిలర్ నారాయణ, బీజేపీ జిల్లా కార్యదర్శి పరశురాం పాల్గొన్నారు.