షాద్నగర్టౌన్, ఏప్రిల్ 22 : నిరుపేదలకు సీఎం సహాయనిధి భరోసానిస్తుందని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని గాంధీనగర్కాలనీకి చెందిన పల్లటి రవీందర్ అనారోగ్యంతో బాధపడుతూ కొన్ని రోజుల క్రితం ఓ దవాఖానలో వైద్యం చేయించుకున్నాడు. అతడికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 30వేల చెక్కును గురువారం పల్లటి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
మొయినాబాద్, ఏప్రిల్22: అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ సీఎంఆర్ఎఫ్ రూ.11.11లక్షల చెక్కులను గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, ఎంపీడీవో విజయలక్ష్మి, ఏవో రాగమ్మ, ఎంపీటీసీ అంజయ్య, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గునుగుర్తి జయవంత్, టీఆర్ఎస్ నాయకులు దర్గ రాజు, డప్పు జగన్, నాగరాజు, పరమేశ్ పాల్గొన్నారు.