సిద్దిపేట టౌన్, జూలై 23 : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి. ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదకర నీటి ప్రవాహ ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ‘మీ రక్షణ.. మా బాధ్యత’ అనే నినాదంతో సేవలందిస్తున్నారు. అత్యవసర సమయంలో ‘పోలీసు టోల్ ఫ్రీ నంబర్ 100’ అందుబాటులో ఉంచారు.
పోలీసుల సూచనలు, జాగ్రత్తలు..
పోలీసులను అభినందించిన సిద్దిపేట సీపీ
శిక్షల శాతం పెరిగినప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని, నేరస్తుల్లో మార్పు వస్తుందని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. గ్రేవ్, ఫోక్సో, క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, కోర్టు డ్యూటీ అధికారులకు కమిషనరేట్ కార్యాలయంలో ఒక రోజు శిక్షణా శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేవ్, ఫోక్స్, క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచాలని పోలీసులకు సూచించారు. సమన్స్, వారెంట్, కోర్టు డిస్పోజల్, కన్వెన్షన్, కాంప్రమైజ్ తదితర సమాచారాన్ని ప్రతి రోజు సీసీటీఎన్ఎస్లో డాటా నమోదు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న డాటాను వారం రోజుల్లో పూర్తి చేయాలని పోలీసులను సూచించారు. ఎస్సీ, ఎస్టీ, క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, ఫోక్సో కేసుల్లో శిక్షల శాతం కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక కమిషన్లు, హైకోర్టు, సుప్రీం కోర్టులు ప్రత్యేకంగా పర్యవేక్షణ జరుపుతున్నదని తెలిపారు. గ్రేవ్ కేసుల్లో ట్రయల్ సమయంలో శిక్షలు పడడానికి సాక్షులను మోటివేట్ చేయాలన్నారు. సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సత్సంబంధాలు పెట్టుకొని కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు.
సెషన్ కోర్టు పరిధిలో ట్రయల్ నడిచే ఫోక్సో, హత్య, లైంగికదాడి తదితర కేసులను లక్ష్యంగా పెట్టుకొని నేరస్తులకు శిక్ష పడేలా సాక్ష్యులను మోటివేట్ చేయాలని సూచించారు. కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను డిస్పోజల్ చేసిన సిద్దిపేట వన్టౌన్, రూరల్, గజ్వేల్, దుబ్బాక, భూంపల్లి, కుకునూరుపల్లి కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. వీరందరికీ రివార్డు అందజేస్తామని తెలిపారు. అంతకు ముందు ఐటీ కోర్స్ ట్రైనింగ్ కో- ఆర్డినేటర్ శ్రీధర్ సీసీటీఎన్ఎస్లో పెండింగ్లో ఉన్న డాటా వివరాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పోలీసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్సై స్వామిదాస్, కానిస్టేబుల్ రాజమల్లు, హెడ్కానిస్టేబుల్ మిస్బాఉద్ద్దీన్, కానిస్టేబుల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.