సిద్దిపేట టౌన్, జూలై 16 : క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ కేసులలో త్వరితగతిన పరిశోధన పూర్తి చేసి నేరస్తులకు శిక్షపడే విధంగా చూడాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. పెండింగ్ కేసులు, ఫంక్షనల్ వర్టికల్ తదితర అంశాలపై శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని క్రమపద్ధతిన విచారణ పూర్తి చేయాలన్నారు. పెండింగ్ కేసులను పకడ్బందీగా పరిశోధన చేసి డిస్పోజల్ చేయాలన్నారు. పోలీసుస్టేషన్ పరిధిలో అన్నౌన్ ప్రాపర్టీ కింద సీజ్ చేసిన వాహనాలను చట్టప్రకారం కేసు నమోదు చేయాలని చెప్పారు. ప్రతి మూడు నెలలకోసారి వాహనాలను వేలం వేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ప్రతి రోజు మానిటరింగ్ చేయాలని తెలిపారు. అన్ని కోణాల్లో కేసులను విచారణ చేసి నిందితులను అరెస్టు చేసి కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బ్లూకోల్ట్స్, పెట్రోల్కార్స్ అధికారులు, సిబ్బందికి డయల్ యువర్ 100 ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి త్వరితగతిన చేరుకొని సమస్యను పరిష్కరించాలని సూచించారు. పాత నేరస్తుల వద్ద ఉన్న పాయింట్ బుక్లను తనిఖీ చేయాలని చెప్పారు. ఈ చలాన్ పెండింగ్లో ఉన్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి జరిమానా కట్టించాలన్నారు. ఫంక్షనల్ వర్టికల్ సిబ్బంది, అధికారులకు సీసీటీఎన్ఎస్లో ఎంట్రీ చేసిన డాటా, పనితీరును బట్టి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మధిర, సిద్దిపేట గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపల్ పరిధిలోని వార్డులలో ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించి సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరించాలని అన్నారు.
పోలీసు స్టేషన్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. బక్రీద్, వినాయకచవితి బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు లాక్డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ను టార్గెట్కు మించి కేసులను తగ్గించిన గజ్వేల్ సీఐ ఆంజనేయులు, రాజగోపాల్పేట, సిద్దిపేట రూరల్, మిరుదొడ్డి, అక్కన్నపేట, కుకునూరుపల్లి, రాయిపోల్, మర్కూక్ల ఎస్సైలను అభినందించారు. వీరికి త్వరలోనే రివార్డులు అందిస్తామన్నారు. పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ల, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి ఏసీపీలను, సీఐలను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాసులు, బాబురావు, రియాజ్ ఉల్హక్, అడిషనల్ ఎస్పీలు నారాయణ, మహేందర్, ఏసీపీ సైదులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.