న్యూయార్క్ : వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీ జూమ్ (Zoom CEO) తమ ఉద్యోగులను ఇక ఆఫీసుల నుంచి పనిచేయాలని ఇటీవల కోరింది. వర్క్ ఫ్రం ఆఫీస్కు సంబంధించి కంపెనీ ఆదేశాలతో ఇక కరోనా సమయంలో ముందుకొచ్చిన వర్క్ ఫ్రం హోం కల్చర్కు తెరపడినట్టేనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
వారానికి కనీసం రెండు రోజుల పాటు ఆఫీసుల నుంచి పనిచేయాలని జూమ్ కోరుతుండటంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పిస్తుండగా జూమ్ సైతం ఇదే బాటన రిమోట్ వర్కింగ్కు స్వస్తి పలుకుతున్న సంకేతాలు పంపింది. ఆఫీసుల నుంచి ఇప్పటికిప్పుడు పనిచేయడం పట్ల ఆసక్తి లేని పలువురు ఉద్యోగులు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆఫీసుల నుంచి పనిచేయడం ఇష్టం లేని వారు రాజీనామా చేయాలనుకుంటే స్వాగతిస్తామని కంపెనీ సీఈవో ఎరిక్ యువన్ తేల్చిచెప్పారు.
అలాంటి ఉద్యోగులకు అంతా మంచి జరగాలని కోరకుంటున్నానని, కంపెనీ అనుసరిస్తున్న సంస్కృతే అతిపెద్ద సమస్యని వ్యాఖ్యానించారు. ఉద్యోగులతో సమావేశం సందర్భంగా యువన్ మాట్లాడుతూ జూమ్కు తన కంపెనీ కల్చర్తోనే సమస్య వాటిల్లుతోందని అన్నారు. ఉద్యోగులు, కస్టమర్లు, పార్టనర్ల పట్ల కంపెనీ ఎంతో కేర్ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇక కంపెనీలో 15 శాతం మంది ఉద్యోగులను జూమ్ తొలగిస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో యువన్ వెల్లడించారు.
Read More :
Chandrayaan-3 | ఆదిపురుష్ సినిమా కంటే కూడా చంద్రయాన్-3 బడ్జెట్ చాలా తక్కువ!