Chandrayaan-3 | న్యూఢిల్లీ, ఆగస్టు 23: చంద్రుడిపైకి విజయవంతంగా ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేసిన భారత్ మరో ఘనతను సాధించింది. అతి తక్కువ ఖర్చుతో మూన్ మిషన్ను పూర్తి చేసిన దేశంగా రికార్డులకెక్కింది. సుమారు రూ.615 కోట్లకే అతి చౌకగా భారత్ చంద్రుడ్ని చేరుకున్నది. చైనా, రష్యా తదితర ఇతర దేశాల పోలిస్తే చంద్రయాన్-3 బడ్జెట్ చాలా తక్కువ కావడం విశేషం. మరో వైపు అనేక సినిమాల బడ్జెట్ సైతం చంద్రయాన్-3 ప్రాజెక్టు కంటే ఎక్కువే కావడం గమనార్హం. ఇటీవల విడుదల అయిన ఆదిపురుష్ సినిమా కంటే చంద్రయాన్- 3కి ప్రయోగానికి ఇస్రో చేసిన ఖర్చు తక్కువే. ఇటీవల గంగా నదిలో కూలిపోయిన భగల్పూర్ వంతెన వ్యయం రూ.1710 కోట్లు కావడం గమనార్హం. వివిధ సినిమాలు, ప్రాజెక్టులు వ్యయాలతో చంద్రయాన్-3 బడ్జెట్ను పోలుస్తూ నెటిజన్లు ఇస్రోను ప్రశంసిస్తున్నారు.
ఇతర దేశాల మూన్ ప్రాజెక్టులు
ఇతర అంశాలు…
సినిమాలు…