(New Kind of Knife) వాషింగ్టన్ : ఇప్పటివరకు మనం స్టీల్తో చేసినవి, ఐరన్, ఉక్కు, సిరామిక్తో చేసిన కత్తులను మాత్రమే చూశాం. రానున్న రోజుల్లో చెక్కతో చేసిన కత్తులు కూడా అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలోని మేరీలాండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెక్క ముక్కతో పదునైన కత్తిని తయారు చేసి చూపించారు. చెక్క కత్తితో నాన్-వెజ్ పదార్థాలను ఎలా ముక్కలుగా కోస్తాం? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదూ! ఆ అనుమానమే అక్కర్లేదంటున్నారు శాస్త్రవేత్తలు. మాంసాన్ని కూడా వెన్న మాదిరిగా కత్తిరించవచ్చునని హామీ ఇస్తున్నారు వారు. ఈ కత్తి స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైనదిగా ఉండటం విశేషం. కలపను ప్రత్యేక మార్గంలో కంప్రెస్ చేయడం ద్వారా తయారు చేశారు. ఈ కత్తికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ మ్యాటర్’ లో ప్రచురించారు.
ఈ చెక్క కత్తిని తయారు చేయడానికి ముందు కలపలో ఒక భాగాన్ని తీసుకుని ఒక ప్రత్యేక రసాయనంలో నానబెడ్తారు. అనంతరం దాన్ని కంప్రెస్ చేస్తారు. చెక్క నుంచి నీరు, తేమను తొలగించిన తర్వాత అది గట్టిపడుతుంది. అప్పుడు దాన్ని కత్తి మాదిరిగా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన కలప సాధారణం కంటే 23 రెట్లు బలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అలాగే, ఇది పర్యావరణానికి ఏ విధంగానూ హాని కలిగించదని హామీ కూడా ఇస్తున్నారు. ఈ కత్తికి ధూళి అంటుకోదని, ఆహార పదార్థాలను కోసినప్పుడు ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దీని అంచులను సాధారణ కత్తుల మాదిరిగానే పదును పెట్టుకోవచ్చంటున్నారు. ఇలాఉండగా, ఈ రకం కత్తులను ఎప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంచేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కలప బలంగా, దట్టంగా ఉండేందుకు ఉపకరించే సెల్యులోజ్ అనే మూలకం చెక్కల్లో ఉంటుందని, ఇది సెరామిక్స్, లోహాల కంటే బలంగా ఉంటున్నందున కత్తి తయారుకు ఎంచుకున్నామని పరిశోధకుడు టెంగ్ లీ తెలిపారు. ఈ కత్తి తయారీకి ఉపయోగించే కలప దొంగల కంట్లో పడలేదన్నారు. కత్తి తయారీ కోసం ఉపయోగించే చెక్కలో 40 నుంచి 50 శాతం సెల్యులోజ్ ఉంటుందని చెప్పారు. చెక్కలోని బలహీనమైన అంశాలను తొలగించి వాటి స్థానంలో సెల్యులోజ్ని నింపడం ద్వారా బలంగా, దట్టమైనదిగా తయారుచేయవచ్చునని పేర్కొన్నారు.
డెన్మార్క్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన సింధు
పట్టాభికి 14 రోజుల రిమాండ్, మచిలీపట్నం జైలుకు తరలింపు
మళ్లీ మొదలైన శ్రీశైలం గిరిప్రదక్షిణం
బోయలు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి
నవంబర్ 1 నుంచి ఏపీ పాఠశాలల్లో నూతన విద్యా విధానం
దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్
అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..