మధుమేహంతో (Blood sugar) బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు శాస్త్రవేత్తలు కృత్రిమ క్లోమాన్ని సృష్టించారు. ప్రస్తుతం దీని పనితీరును పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ వ్యాధితో బాధపడుతూ మూత్రపిండాల డయాలిసిస్ చేయించుకుంటున్న వారికి ఇది శుభవార్తే అని పరిశోధకులు చెప్తున్నారు. ఈ కృత్రిమ క్లోమం శరీరానికి కావాల్సిన స్థాయిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది. ఫలితంగా హై, లో బ్లడ్ షుగర్లను కంట్రోల్ చేస్తుంది. ఈ కృత్రిమ క్లోమం అందుబాటులోకి వస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిన అవసరం ఉండదు. దీనికి సంబంధించిన పరిశోధనలు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, బెర్న్లోని స్విట్జర్లాండ్ యూనివర్శిటీ హాస్పిటల్ సంయుక్తంగా చేపడుతున్నాయి. ఈ పరిశోధన పత్రం ‘జర్నల్ నేచర్ మెడిసిన్’ లో ప్రచురితమైంది.
పరిశోధకుడు డాక్టర్ షార్లెట్ బౌటన్ తెలిపిన వివరాల ప్రకారం.. డయాబెటిస్తో బాధపడుతున్నవారు, మూత్రపిండాల సమస్య ఉన్నవారిలో ప్రధానంగా ఎక్కువ, తక్కువ మొత్తంలో రక్తంలోకి చక్కెరలు విడుదలవడం జరుగుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు వీలుగా కృత్రిమ క్లోమ గ్రంథిని సిద్ధం చేశారు. చక్కెర వ్యాధితో బాధపడుతూ మూత్రిపిండాల డయాలిసిస్ చేయించుకుంటున్న 26 మంది రోగులపై 2019 అక్టోబర్ నుంచి 2020 నవంబర్ వరకు పరిశోధనలు జరిపారు. వీరిలో 13 మందికి కృత్రిమ క్లోమాన్ని అమర్చగా.. మిగిలిన 13 మందికి ఇన్సులిన్ థెరపీ ద్వారా చికిత్స అందించారు. 20 రోజుల తర్వాత వీరిని గమనించగా.. కృత్రిమ క్లోమ గ్రంథిని అమర్చిన వారి రక్తంలో చక్కెరల నియంత్రణ జరిగినట్లు గుర్తించారు.
కృత్రిమ క్లోమ గ్రంథిని బయటి నుంచి కంప్యూటర్ సాఫ్ట్వేర్ సాయంతో ఆపరేట్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ వినియోగదారుడి మొబైల్ ఫోన్ నుంచి కృత్రిమ క్లోమానికి సిగ్నల్స్ పంపి ఇన్సులిన్ను స్రవించడాన్ని కంట్రోల్ చేస్తుంది. గ్లూకోజ్ మానిటర్ పరీక్షల నివేదికల ద్వారా రక్తంలో చక్కెరల స్థాయిలను అవసరానికి తగినట్లుగా పెంచడం, తగ్గించడం చేసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన మూత్రపిండాలున్న డయాబెటిస్ రోగులపై ట్రయల్స్ జరిపినట్లు బెర్న్లోని స్విట్జర్లాండ్ యూనివర్శిటీ హాస్పిటల్కు చెందిన పరిశోధకుడు డాక్టర్ లియా బెయిలి వెల్లడించారు. కృత్రిమ క్లోమ గ్రంథి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వారుగా తమకు అవసరమైనంత ఇన్సులిన్ను విడుదల చేయడం, ఆపడం చేసుకోవచ్చునని తెలిపారు. త్వరలో మూత్రపిండాల డయాలిసిస్ చేసుకుంటున్న షుగర్ పేషెంట్లపై పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు డాక్టర్ లియా బెయిలి పేర్కొన్నారు. ఇలాంటి వారు ఇక జీవితంలో మూత్రపిండాల డయాలిసిస్కు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
మిస్ కాల్తో గ్యాస్ కనెక్షన్..!
రైతు ఉద్యమంలో చీలిక.. గుర్నామ్సింగ్ సస్పెండ్
నీరజ్కు అభినందనలు.. ఈరోజు ఆటో రైడింగ్ ఫ్రీ
క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏండ్లు
లండన్లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్..
గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రాకు ఈ ఫుడ్ అంటే ఇష్టమంటా..!
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..