శాంటియాగో : డైనోసార్ల యుగంలో నివసించిన ఉడుము వంటి క్షీరదాన్ని అఫోసిల్ చిలీ పటగోనియాలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్షీరదాలు దక్షిణ అమెరికాలో ఆ భాగాన్ని గతంలో అనుకున్నదానికంటే చాలా ముందుగానే తిరిగాయని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకే కావాలని అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఐదు దంతాలతో ఉండే ఈ జీవి యొక్క శిలాజ దవడ ఎముకలో ఒక భాగం ప్రసిద్ధ టోర్రెస్ డెల్ పైన్ జాతీయ ఉద్యానవనానికి సమీపంలో కనుగొన్నారు. అర్జెంటీనా నేచురల్ హిస్టరీ, లా ప్లాటా మ్యూజియం, చిలీ అంటార్కిటిక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులతో కలిసి పనిచేస్తున్న చిలీ విశ్వవిద్యాలయ నిపుణులు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ఈ ఆవిష్కరణను ప్రచురించారు.
ఈ జంతువుకు ఓరెథెరియం టజెన్ అని పేరు పెట్టారు. గ్రీకు, స్థానిక దేశీయ భాషలో దీనికి ‘ఐదు దంతాల మృగం’ అని అర్ధం. ఈ జంతువు 72 నుంచి 74 మిలియన్ సంవత్సరాల క్రితం ఎగువ క్రెటేషియస్ కాలంలో మెసోజోయిక్ శకం చివరిలో నివసించినట్లు భావిస్తున్నారు. ఇది పూర్తిగా శాకాహారి అని కూడా గుర్తించారు.
దీనిని గుర్తించడానికి ముందు, గత సంవత్సరం ఇదే ప్రాంతంలో ఎలుకల వంటి జీవి అయిన మగల్లనోడాన్ బైకాష్కెంకే యొక్క దంతాలను కూడా కనుగొన్నారు. ఇవి 38 నుంఇ 46 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించి క్షీరదాలు అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వీటిని అమెరికా యొక్క దక్షిణ చివరలో కనుగొన్నారు.
డైనోసార్లతో కలిసి ఉనికిలో ఉన్న దీర్ఘకాలంగా అంతరించిపోయిన ప్రారంభ క్షీరదాల సమూహమైన గోండ్వానాథెరియా పరిణామ పజిల్ను పూర్తి చేయడానికి ఈ అన్వేషణలు కీలకం అని చిలీ విశ్వవిద్యాలయ పాలియోంటాలజిస్ట్ సెర్గియో సోటో చెప్పారు. చిలీ దక్షిణ కొనలో పాలియోంటాలజీ పరంగా అపారమైన సంభావ్యత ఉన్నదని, భవిష్యత్తులో మేము కనుగొనే ఇతర ఆవిష్కరణలను ఇవి వెల్లడిస్తున్నాయి అని సోటో చెప్పారు. డైనోసార్లు, క్షీరదాలు, ఇతర సమూహాల గురించి మాకు చాలా కాలంగా ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది అని సోటో పేర్కొన్నారు.
కొవిడ్తో నటుడు సతీష్ కౌల్ కన్నుమూత
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన ముగ్గురు వ్యోమగాములు
కొవిడ్ వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
భారత్లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..