ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సామ్సంగ్.. తన గెలాక్సీ సీరిస్లో భాగంగా.. ఏ03 స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే.. ఫోన్ అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది.. ధర లాంటి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ల వేరియంట్లలో లభించనుంది. సామ్సంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్.. 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటి వీ డిస్ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, 48 ఎంపీ రేర్ కెమెరా లాంటి ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.
ఈ ఫోన్లో మూడు వేరియంట్స్ ఉంటాయి. 3 జీబీ ప్లస్ 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ప్లస్ 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో ఫోన్లు విడుదల కానున్నాయి.
48 ఎంపీ రేర్ కెమెరాతో పాటు.. 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్లో ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు ఈ ఫోన్ డిజైన్ కూడా స్టయిలిష్గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. వాటర్డ్రాప్ స్టైల్ నాట్చ్, టెక్సర్డ్ బ్యాక్ ప్యానెల్, రౌండ్ కార్నర్స్, ఫ్లాట్ ఎడ్జ్ డిస్ప్లే లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Motorola : భారత్లో త్వరలో మోటో ట్యాబ్ జీ70 లాంఛ్
Xiaomi : డిసెంబర్ 16న షియామి 12, షియామి 12X లాంఛ్
Password | మీ పాస్వర్డ్ హ్యాకర్లకు తెలిసిపోయిందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి..
Xiaomi : డిసెంబర్ 16న షియామి 12, షియామి 12X లాంఛ్
Whatsapp | రెండు కీలకమైన సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్