న్యూఢిల్లీ : మొటొరొలా భారత్లో త్వరలో న్యూ ట్యాబ్లెట్ను లాంఛ్ చేయనుంది. మోటో ట్యాబ్ జీ20 లాంఛ్ అనంతరం ప్రీమియం మోటో ట్యాబ్ జీ70 లాంఛ్కు మొటొరోలా సన్నాహాలు చేస్తోంది. ఈ డివైజ్కు ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ లభించింది.
మోటో ట్యాబ్ జీ70కి బీఐఎస్ సర్టిఫికేషన్ దక్కడంతో త్వరలో భారత్లో లాంఛ్ కానుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ ట్విట్టర్లో వెల్లడించారు. ఎంటీ8183ఏ మోడల్ నెంబర్తో 4జీబీ ర్యాం వేరియంట్తో మీడియాటెక్ కంపానియా ఎస్ఓసీ ప్రాసెసర్తో ఈ ట్యాబ్ కస్ఠమర్ల ముందుకు రానుంది. మోటో ట్యాబ్ జీ70 ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది. 15 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చేలా మోటో ట్యాబ్ జీ70 7700ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది.