న్యూఢిల్లీ : పోకో ఎక్స్5 (Poco X5) భారత్లో త్వరలో లాంఛ్ కానుందని కంపెనీ వెల్లడించింది. గ్లోబల్ లాంఛ్ పూర్తయిన ఈ డివైజ్ దేశీ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని పోకో ట్విట్టర్ వేదికగా నిర్ధారించింది. తమ లేటెస్ట్ 5జీ ఫోన్ త్వరలో భారత కస్టమర్ల ముందుకు రానుందని కంపెనీ కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ పేర్కొన్నారు.
వచ్చే వారం పోకో ఎక్స్5 భారత్లో లాంఛ్ కానుందని భావిస్తున్నారు. భారత్ మోడల్ ఫుల్హెచ్డీ+ పిక్సెల్స్ రిజల్యూషన్తో 6.67 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 695 ఎస్ఓసీ చిప్సెట్తో రానున్న ఈ ఫోన్ రూ. 20,000లోపు ధరలో బడ్జెట్ స్మార్ట్ఫోన్గా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.
పోకో ఎక్స్5 గ్లోబల్ మోడల్ 33డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఈ హ్యాండ్సెట్ వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు ముందుభాగంలో సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. పోకో ఎక్స్5కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ త్వరలో అధికారికంగా వెల్లడించనుంది.
Read More :
Best 5G phones | రూ. 30,000లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..!
Best smartwatches | రూ. 5000లోపు బెస్ట్ స్మార్ట్వాచ్ల కోసం చూస్తున్నారా..!