హైదరాబాద్ : దేశంలో ఒక్క విద్యా వ్యస్థ కాదు అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయని జెన్జీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపటిన నిరసనకు వేలాది మంది తరలివచ్చారు. విద్యార్థుల ఉద్యమంపై తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీతో ఆవేదనతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఎంతో మంది పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు బాధలో ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శిం చారు. అలాగే దేశంలో పెట్రోల్ ధరలు, రూపాయి విలువ ఇంకా ఎన్నో వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అన్ని మారాలని కోరుకుంటున్నామని తెలిపారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పూర్తిగా అమ్ముడుపోయిందని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మీడియాపై మా జనరేషన్కు నమ్మకంలేదన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.
ఒక్క విద్యావ్యవస్థ కాదు అన్ని వ్యవస్థల్లో దేశం దిగజారిపోతోంది
పెట్రోల్ ధరలు, రూపాయి విలువ ఇంకా ఎన్నో వ్యవస్థలు దెబ్బతిన్నాయి, అన్ని మారాలని కోరుకుంటున్నాము
మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయిందని స్పష్టంగా కనిపిస్తుంది
ఎంతో మంది పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు ఆవేదనలో ఉన్నా కేంద్ర… https://t.co/2j1ne0C94X pic.twitter.com/EqcsWb6JFe
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2026