న్యూఢిల్లీ : భారీ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఇన్హౌస్ 5జీ మోడెమ్తో వచ్చే ఏడాది ఐఫోన్ ఎస్ఈ 4 (iPhone SE 4 )గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. చివరి ఐఫోన్ ఎస్ఈ 3 5జీ, న్యూ చిప్సెట్తో 2022లో లాంఛ్ అయింది. స్వల్ప విరామం అనంతరం ఐఫోన్ ఎస్ఈ 4 ప్రొడక్షన్ను యాపిల్ ఇటీవల రీస్టార్ట్ చేసింది. యాపిల్ మోస్ట్ అఫర్డబుల్ ఫోన్ నెక్ట్స్ జెన్ ఐఫోన్ ఎస్ఈ 4 ఎల్సీడీ స్దానంలో ఓఎల్ఈడీ ప్యానెల్తో రానుందని ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కూ వెల్లడించారు.
ఐఫోన్ ఎస్ఈ 4 యాపిల్ ఇన్హౌస్ 5జీ మోడెంతో రానుంది. ఐఫోన్ ఎస్ఈ 4 యాపిల్ 6.1 ఇంచ్ ఐఫోన్ 14కు మైనర్ మోడిఫికేషన్స్తో రానుందని కూ వెల్లడించారు. యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ ఎస్ఈ 4 ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్, గ్లాస్ బ్యాక్ ఫీచర్తో ఆకట్టుకుంటుందని కూ పేర్కొన్నారు. క్వాల్కాం ఎక్స్ సిరీస్ 5జీ మోడెమ్స్కు బదులు యాపిల్ ఇన్హౌస్ 5జీ మోడెమ్ను యూజ్ చేస్తుందని చెప్పారు.
ఇదే 5జీ మోడెం 2024లో లాంఛ్ అయ్యే ఐఫోన్ 16 సిరీస్లోనూ వాడనున్నారు. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4 ప్రొడక్షన్ సజావుగా సాగుతుందని అన్నారు. ఇక యాపిల్ 5జీ సపోర్ట్ను ఐప్యాడ్స్కు విస్తరించనుంది. ప్రొప్రైటరీ మోడెమ్ను తన ట్యాబ్లెట్స్లోనూ యాపిల్ వినియోగంలోకి తేనుంది. అప్కమింగ్ ఐఫోన్ ఎస్ఈ 4లో కెమెరా టెక్నాలజీనీ మెరుగుపరచాలని యాపిల్ కోరుకుంటోంది. ఈ ఫోన్ చార్జింగ్ కోసం యూఎస్బీ-సీ పోర్ట్తో కస్టమర్ల ముందుకు రానుంది.
Read More :
టిక్టాక్పై భారత్, కెనడా బ్యాన్..ఇరకాటంలో బైట్డ్యాన్స్..!
Xiaomi 13 Pro | భారత్ మార్కెట్లోకి షియోమీ 13 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్!