Xiaomi 13 Pro | చైనా టెక్ జెయింట్ షియోమీ.. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2023 వేదికపై గ్లోబల్ మార్కెట్లో మూడు షియోమీ 13 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. షియోమీ 13 సిరీస్లో షియోమీ 13, షియోమీ 13 ప్రో, షియోమీ 13 లైట్ ఉన్నాయి. షియోమీ ఫ్లాగ్షిప్ 13 ప్రో ఫోన్ను గతేడాది డిసెంబర్లోనే చైనాలో ఆవిష్కరించింది. తాజాగా భారత్తోపాటు ప్రపంచ మార్కెట్లోకి తీసుకొచ్చింది. షియోమీ 13 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 8థ్ జనరేషన్ 2 ప్రాసెసర్తో వస్తున్నది. ఇది సిరామిక్ వైట్, సిరామిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
షియోమీ 13 ఫోన్ రమారమీ రూ.87,585 (999 యూరోలు) పలుకుతుంది. ఇక షియోమీ 13 ప్రో సుమారు రూ.1,13,887 (1299 యూరోలు)లకు లభిస్తాయి. షియోమీ 13 లైట్ 499 యూరోలకు కొనుగోలు చేయొచ్చు. భారత్లో షియోమీ 13 ప్రో ఫోన్ ధర మంగళవారం మధ్యాహ్నం వెల్లడించనున్నది. ఆసక్తి గల యూజర్లు కంపెనీ వెబ్సైట్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్లోనే బుక్ చేసుకోవాలి.