Netflix | ఓటీటీ (OTT) సంస్థల్లో రారాజుగా వెలుగుతున్న నెట్ఫ్లిక్స్ (Netflix ).. పాస్వర్డ్ షేరింగ్ (Password Sharing) విషయంలో కీలక ప్రకటన చేసింది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పాస్ వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్ (India)లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఇకపై కుటుంబ సభ్యులు మాత్రమే పాస్వర్డ్ను షేర్ చేసుకునేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్ఫ్లిక్స్ తన యూజర్లకు మెయిల్స్ పంపింది.
ఫ్యామిలీ మెంబర్స్ ( single household) కాకుండా ఇతరులతో పాస్వర్డ్ షేర్ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తమ కస్టమర్ల అభిరుచి మేరకు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీషోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. అయితే, చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. ఇంకా ప్రొఫైల్ను బదిలీ చేయడం అలాగే యాక్సెస్, డివైజెస్ మ్యానేజ్ చేయడం వంటి కొత్త ఫీచర్ల ప్రయోజనాన్ని పొందవచ్చని తెలిపింది.
గత కొంతకాలంగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ఆదాయం తగ్గుముఖం పట్టడంతో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే పాస్వర్డ్ షేరింగ్పై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం గురించి సంస్థ ఈ ఏడాది మేలో ప్రకటన వెలువరించింది కూడా. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా మొత్తం 100కు పైగా దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్ పై పరిమితులను విధించింది. కాగా, ఆ విధానాన్ని భారత్ లో తాజాగా అమల్లోకి తెచ్చింది.
మరోవైపు పాస్ వర్డ్ షేరింగ్ విధానాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో దాదాపు 60 లక్షల మంది కొత్త యూజర్లు చేరినట్లు సంస్థ తెలిపింది. ఇటీవలే ముగిసిన త్రైమాసికంలో మొత్తం 238 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ తో 1.5 బిలియన్ డాలర్ల లాభాన్ని అర్జించినట్లు కంపెనీ తెలిపింది.
Also Read..
World Cup Trophy | కింగ్ ఖాన్ చేతిలో CWC23 ట్రోఫీ .. ఫొటో షేర్ చేసిన ఐసీసీ
Road Accident | యాక్సిడెంట్ జరిగిన చోట గుమిగూడిన జనంపైకి దూసుకెళ్లిన కారు.. 9 మంది మృతి
Landslide | ఘోర ప్రమాదం.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి