Road Accident | గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫ్లైఓవర్ పై కారు ప్రమాదం జరగ్గా.. అక్కడ గుమిగూడిన జనంపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శాటిలైట్ ప్రాంతంలో (Satellite area) గల సర్ఖేజ్ – గాంధీ నగర్ హైవే (Sarkhej-Gandhinagar highway)పై ఉన్న ఇస్కాన్ బ్రిడ్జి (ISKCON bridge)పై తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో థార్ కారు ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. దీంతో మిగతా వాహనదారులు అక్కడ గుమిగూడారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేస్తుండగా.. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఓ జాగ్వార్ కారు అక్కడ గుమిగూడిన జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
#UPDATE | 12 people were brought to the hospital out of which 9 were dead. The injured are being treated in the hospital: Kripa Patel, Medical Officer, Sola Civil Hospital https://t.co/gQI8uJFcjZ
— ANI (@ANI) July 20, 2023
Also Read..
Samantha | ధ్యానం ప్రశాంతతకి అత్యంత శక్తివంతమైన మార్గం.. సమంత పోస్ట్ వైరల్
Landslide | ఘోర ప్రమాదం.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి
Minister KTR | మోదీజీ.. అమిత్ జీ ఎక్కడున్నారు..? మణిపూర్ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్