Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) కొంత కాలంపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి మయోసైటిస్ అనే డిసీజ్ తో బాధపడుతున్న సామ్.. చికిత్స కోసం కాస్త విరామం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నటి తాజాగా తమిళనాడు కోయంబత్తూరు (Coimbatore)లోని ఈషా ఫౌండేషన్ (Isha Yoga Centre)కు వెళ్లారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ధ్యానం (meditation) చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఆ ఫొటోల్లో సమంత.. వైట్ డ్రెస్ వేసుకుని అందరి మధ్యలో ఎంతో సింపుల్ గా ధ్యానం చేస్తూ కనిపించారు. ‘ఇప్పటి వరకూ ఎలాంటి ఆలోచనలూ రాకుండా ఎటూ కదలకుండా కూర్చోవడం అసాధ్యమనిపించింది. కానీ, ధ్యానమనేది ప్రశాంతతకి అత్యంత శక్తివంతమైన మార్గమని ఇప్పుడే తెలిసింది. ఇది సింపుల్ గా అత్యంత శక్తివంతంగా ఉంటుందని ఊహించనేలేదు’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక సామ్ ప్రొఫెషనల్ లైఫ్ కి వస్తే.. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ఖుషి (Kushi) చిత్రంలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’ (Citadel) వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఈ సిరీస్ షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేసింది సామ్. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
Alimony | భార్యకే కాదు.. శునకాలకూ భరణం ఇవ్వాల్సిందే.. భర్తను ఆదేశిస్తూ బాంబే కోర్టు తీర్పు
Tomato | టమాటలు అమ్మి నెల రోజుల్లోనే 3 కోట్లు సంపాదించాడు!