హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో ఉన్నవారు బూతులు మాట్లాడటం తప్పు కాదని.. ఆ మాటలను టీవీ చానళ్లు ప్రసారం చేయడం తప్పని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఓ టీవీ చానల్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడటంపై విలేకరి ప్రశ్నించగా.. బూతులు మాట్లాడటం తప్పేకాదని, రాజకీయాల్లో ఉన్నవాళ్లు అలాగే మాట్లాడుతార ని చెప్పారు. అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించడం తమ తప్పుకాదని, వాటిని ప్రసారం చేసేవారిదే తప్పని అంటూ.. అలా ప్రసారం చేసే ఒకరిద్దరు పాత్రికేయులను జైల్లో వేస్తే ఇలాంటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
తెలంగాణలో ఒకరకమైన భాషను ఒకప్పుడు అసహ్యించుకున్నారు. ఆ భాషను వద్దనుకున్నారు. మీరేమో ఒకరిని చీర కట్టుకొని రండి అని అంటే.. ఆయనేమో మీరు, రాహుల్ గాంధీలే చీర కట్టుకొని రావాలంటున్నారు. డ్రాయర్, బనీ న్, లంగాల గురించి మాట్లాడుతున్నారు.
అసలు సమస్య మీతోనే ఉన్నది. మీలో ఒకరిద్దరిని జైలుకు తోలితే కానీ సమస్య పరిష్కారం అయ్యేలా లేదు. ఇలా మాట్లాడంగానే వాటిని వేయవద్దు. మాట్లాడేవారిని చూపించవద్దు. మీపై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మాకు పొలిటికల్ యాంబిషన్ ఉంటుంది. మీరున్నది ఫోర్త్ ఎస్టేట్లో.. సామాజిక బాధ్యత వంద శాతం అమలు చేయాల్సింది మీరు. అట్లా మాట్లాడేవారి ప్రసంగాలను మీరు నిషేధించాలి.. నియంత్రించాలి. అప్పుడే సమాజానికి వారి బాధ తప్పుతుంది.
ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేది. గురువెవ్వరు..? శిష్యుడెవ్వరు..? నేను ఆయనకు సహచరుడినని చెప్తున్న. బుద్ధిలేని గాడిదకొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే బుడ్డిమీద తంతా.. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు. నేను ఇం డిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి తెలుగుదేశంలో చేరిన. నేను సహచరుడిని.
జీతాలు వచ్చాయా లేదా అని కాదు.. ప్రభుత్వం వాడుకునే ప్రతి పైసా.. ప్రతి నెల రూ.350 కోట్లు ఆర్టీసికి చెల్లించాం. ఇప్పటివరకు 1369 కోట్లు చెల్లించాం. ఆర్టీసీ వాళ్లు ఎన్నికలకోడ్ వల్ల జీతాలు ఇచ్చారా లేదా అన్నది ఎన్నికల సంఘం అధికారి వికాస్రాజ్ అని ఉంటాడు కదా.. ఆయనను అడిగితే మీకు సమాధానం వస్తుంది.