నాగర్కర్నూల్ : రాష్ట్ర స్థాయి నవోదయ విద్యాలయాల ఖో-ఖో ( Kho-Kho ) క్రీడా పోటీలు జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. అండర్ -14,17,19 విభాగాలలో మూడు రోజుల పాటు జరుగనున్న పోటీలను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ( SP Sangram Singh Patil ) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడలలో రాణించడం ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలు పోటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగడమే క్రీడాస్ఫూర్తి లక్ష్యమని వివరిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యా యులు, వివిధ రాష్ట్రాల నుంచిన క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.