ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా నుంచి మోటో జీ31 స్మార్ట్ఫోన్ భారత్ మార్కెట్లోకి తాజాగా విడుదలైంది. ఈ స్మార్ట్ఫోన్ను బెస్ట్ ఫీచర్లతో మోటరోలా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల కాగా.. 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 నుంచి ప్రారంభం కాగా.. 6 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉండనుంది. బ్లూ, గ్రే కలర్స్లో ఈ ఫోన్ లభిస్తుంది. డిసెంబర్ 6, 2021 మధ్యాహ్నం 12 నుంచి ఈ ఫోన్ సేల్స్ ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రారంభం కానున్నాయి.
మీడియాటెక్ హీలియో జీ85 ఎస్వోసీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్, 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ హోల్ పంచ్ డిస్ప్లే, 60 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 50 ఎంపీ రేర్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్టీఈ, ఎఫ్ఎమ్ రేడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5, డుయల్ బాండ్ వైఫై 802.11 ఏసీ, యూఎస్బీ సీ టైప్ పోర్ట్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Reliance Jio : జియో కస్టమర్లకు భారీ షాక్.. కాస్ట్లీ కానున్న ప్రీపెయిడ్ ప్లాన్స్
Twitter : ట్విట్టర్లో సూపర్బ్ ఫీచర్.. ట్వీట్లతో ఇబ్బంది పెట్టే యూజర్లకు ఇక చెక్ పెట్టేయొచ్చు
Motorola : స్మార్ట్ఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. మోటరోలా నుంచి 200 ఎంపీ కెమెరాతో ఫోన్
Motorola : భారత్లో త్వరలో మోటో ట్యాబ్ జీ70 లాంఛ్