ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్కు ఉన్న క్రేజ్ తెలుసు కదా. ఇప్పటికే యాపిల్ కంపెనీ ఐఫోన్ 13ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే.. బడ్జెట్ ధరలో ఎక్కువ అమ్మకాలతో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన ఐఫోన్ మోడల్ ఎస్ఈ. ఈ ఫోన్ను అప్పట్లో చాలామంది కొనుగోలు చేశారు. దీనికి 2020లో చాలా డిమాండ్ ఏర్పడింది. అన్ని బెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో ఈ ఫోన్ రిలీజ్ అయింది.
అయితే.. ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో 4జీ నుంచి అందరూ 5జీకి మారుతున్నారు. ఇంటర్నెట్ ఇంకా వేగం పెంచుకొని మనముందుకు వచ్చేసింది. దీంతో 5జీ ఫోన్లకు డిమాండ్ ఏర్పడింది.
అందుకే.. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఫోన్ను రీలాంచ్ చేస్తోంది. అయితే.. ఈసారి ఫీచర్లలో కొన్ని మార్పులు చేసి త్వరలో ఐఫోన్ ఎస్ఈని యాపిల్ ఫోన్ లవర్స్ కోసం లాంచ్ చేయనుంది. వచ్చే సంవత్సరం మార్చిలోగా ఈ ఫోన్ను రిలీజ్ చేయనుంది. దీనికి ఐఫోన్ ఎస్ఈ 2022 అనే పేరు పెట్టింది.
5జీ కనెక్టివిటీ, ఏ15 బయోనిక్ చిప్ లాంటి కొత్త ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది. మిగితా ఫీచర్లు, డిస్ప్లే అన్నీ పాత మోడల్వే ఉంటాయని తెలుస్తోంది. అయితే.. ఐఫోన్ ఎస్ఈ మోడల్లో ఎక్కువ డిస్ప్లే ఫోన్ను కూడా యాపిల్ తీసుకొస్తున్నట్టు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Reproducing Robots | పిల్లలు కంటున్న రోబోలు.. షాకింగ్ విషయం చెప్పిన సైంటిస్టులు
Twitter CEO Salary | ట్విట్టర్ న్యూ సీఈవో వేతనం ఎంతంటే..!
Samsung Galaxy : శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఎస్22+ కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్!
Redmi : రెడ్మి నోట్ 11టీ ఇండియా లాంఛ్!