యాపిల్ సంస్థ.. ఐఫోన్ లవర్స్కు మరో గుడ్ న్యూస్ చెప్పింది. 5జీ, బయోనిక్ చిప్సెట్ ఏ15 లాంటి ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ 3 విడుదల కానుంది. ఇటీవల యాపిల్ సంస్థ లాంచ్ చేసిన ఐఫోన్ 13 సిరీస్లోనూ ప్రధానంగా 5జీ, బయోనిక్ చిప్సెట్ ఏ15 ఫీచర్లు ఉన్నాయి. అయితే.. ఇదివరకే లాంచ్ చేసిన ఐఫోన్ ఎస్ఈ సిరీస్ డిజైన్తోనే ఎస్ఈ 3 సిరీస్ రానుంది. వచ్చే డిసెంబర్ నుంచి కొత్త ఐఫోన్ ఎస్ఈ సిరీస్ ప్రొడక్షన్ను యాపిల్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. 2022 జూన్ నుంచి ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి రానుంది.
5.5 ఇంచ్ డిస్ప్లే, టచ్ ఐడీ సైడ్ బటన్, 5జీ కనెక్టివిటీ, బయోనిక్ చిప్సెట్ ఏ15 లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఐఫోన్ 12, 13 కు డిజైన్ చేసిన ఫ్లాట్ ఎడ్జ్డ్ డిజైన్నే ఐఫోన్ ఎస్ఈ సిరీస్లో కూడా వాడుతున్నారు.
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ మోడల్ ఫోన్ను రూ.25,999కే అందిస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ ఎంఆర్పీ ధర రూ.39,900. 4.7 ఇంచ్ రెటినా హెచ్డీ డిస్ప్లే, ట్రూ టోన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10, యాపిల్ ఏ13 బయోనిక్ చిప్, యాపిల్ ఐఫోన్ 11 లైన్ అప్ లాంటి ఫీచర్లు.. ఐఫోన్ ఎస్ఈలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Flipkart Big Billion Days Sale : ఈ అర్ధరాత్రితో ముగియనున్న సేల్.. లాస్ట్ మినట్ డీల్స్ ఇవే
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Jio Offer | నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లకు జియో బంపర్ ఆఫర్
Telegram | వాట్సాప్ డౌన్.. పండగ చేసుకున్న టెలిగ్రామ్.. భారీగా కొత్త యూజర్లు
OnePlus 9RT : త్వరలో భారత మార్కెట్లోకి వన్ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే