న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలు, మందగమనంతో పలు టెక్ కంపెనీలు (HCL Tech) మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా, ట్విట్టర్, యాక్సెంచర్ వంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. సంక్లిష్ట ఆర్ధిక పరిస్ధితులు, స్ధూల ఆర్ధిక అంశాలు ప్రతికూలంగా ఉన్నా ఉద్యోగార్ధుల్లో ఆశలు రేకెత్తిస్తూ నియామకాలకు హెచ్సీఎల్ టెక్ తెరతీసింది.
రాబోయే రెండేండ్లలో వేయి మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు హెచ్సీఎల్ టెక్ ప్రకటించింది. రుమేనియాలో ఈ నియామకాలు చేపడతామని కంపెనీ తెలిపింది. ప్రముఖ రుమేనియన్ యూనివర్సిటీలతో భాగస్వామ్యం ద్వారా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుంటామని హెచ్సీఎల్ టెక్ పేర్కొంది. హెచ్సీఎల్ రుమేనియాలో ఐదేండ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం రుమేనియాలో హెచ్సీఎల్ కంపెనీలో వేయి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
పలు కంపెనీలు దశలవారీగా ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలో తాము చురుకుగా హైరింగ్ చేపడుతున్నామని, టెక్నాలజీలో కెరీర్ ఆశించే అభ్యర్ధులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని హెసీఎల్ టెక్ కంట్రీ హెడ్ (రుమేనియా) ఇలిన్ పదురరు పేర్కొన్నారు. విద్యార్ధులకు ఇంటర్న్షిప్లో భాగంగా వారికి శిక్షణ ఇచ్చి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పారు.
Read More
Meta | మాస్ లేఆఫ్స్ అనంతరం బోనస్ చెల్లింపుల్లో కోత
Apple | యాపిల్ యూజర్లకు గుడ్న్యూస్ : పే ల్యాటర్ లాంఛ్