సదాశివపేట, మే 28 : ప్రభుత్వం నిర్ణయించిన లాక్డౌన్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని డీఎస్పీ బాలాజీ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి కొత్త బస్టాండ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సదాశివపేటలో లాక్డౌన్ను పరిశీలించి సడలింపు సమయం దాటిన తరువాత తిరుగుతున్న వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వాహనాన్ని ఆపి వివరాలు అడుగగా సరైన విధంగా లేకపోవడంతో కేసులు చేయాలని పోలీసులను ఆదేశించారు. సబ్ డివిజన్ పరిధిలో కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాలల్లో లాక్డౌన్ను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పట్టణ, రూరల్ ఇన్స్పెక్టర్లు రమేశ్, శివలింగం, సదాశివపేట సీఐ సంతోశ్కుమార్, ఎస్ఐ సుభాశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
అధిక ధరలు తీసుకోవద్దు
సదాశివపేట, మే 28 : ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల నుంచి అధిక ధరలు వసూలు చేయవద్దని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సూచించారు. శుక్రవారం సదాశివపేట పట్టణంలోని అంబులెన్స్ యజమానులతో అధిక ధరలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో రోగులను దవాఖానలకు తరలించే సందర్భంగా అంబులెన్స్ డ్రైవర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. అంబులెన్స్ల కొరత వల్ల ఎవరి వద్ద నుంచి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయరాదని, ఎవరైనా వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానవత్వంతో రోగులకు సహకరించి తక్కువ డబ్బులు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీఐ సంతోశ్కుమార్, అంబులెన్స్ యజమానులు పాల్గొన్నారు.
కట్టుదిట్టంగా లాక్డౌన్
గుమ్మడిదల, మే 28: కట్టుదిట్టంగా లాక్డౌన్ను పోలీసులు కొనసాగిస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పా టు బొంతపల్లి జాతీయ రహదారిపై సీఐ లాలూనాయక్, ఎస్ ఐ విజయకృష్ణ తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేశారు. అనుమతులు లేని హనదారులకు జరిమానా విధించారు. మాస్కులు లేని వారిని హెచ్చరిరంచారు.