రామచంద్రాపురం, ఏప్రిల్ 18: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కౌన్సిలర్ లచ్చిరాంనాయక్ అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్లో కౌన్సిలర్ లచ్చిరాంనాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించా రు. కాలనీలోని రోడ్లను శుభ్రం చేసి చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్ల ను తొలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పలుమార్లు ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ వారు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ప్లాస్టిక్ వాడకం పెరిగితే వాతావరణ కాలుష్యం పెరిగి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామని, దుకాణాదారులు కూడా ప్లాస్టిక్ కవర్లను వాడొద్దన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు బాలయ్య, యాదగిరి, శేఖర్, దిలీప్, సుదర్శన్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఖమ్మం కార్పొరేషన్కు 522 నామినేషన్లు దాఖలు